N7TV News Telugu - Andhra Pradesh / NTRDistrict : జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఎన్టీఆర్ జిల్లా స్థాయి సమావేశం... NTR జిల్లా స్థాయి సమావేశం నాకు హాజరైన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బి.హెచ్. సుమిత్రానందన్... జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కనకపుడి. వెంకటేశ్వరరావు మరియు పి. శ్యాంబాబు అధ్యక్షతన ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు... ఈరోజు జరిగిన సభను ఉద్దేశించి జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి.హెచ్ సుమిత్ర నందన్ మాట్లాడుతూ... RTI...2005 చట్టం అనేది అంతర్జాతీయ స్థాయిలో 1776లో ఒక తీర్మానం ద్వారా స్వీడన్ దేశంలో తీసుకు రావడం జరిగింది... మనదేశంలో 2005 సంవత్సరంలో కొన్ని సవరణలు ద్వారా తీసుకు రావడం జరిగినది... *RTI...2005 చట్టం అంటే అవినీతి కి పాలుబడే అధికారులకు భయం అని... ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలా పనితీరు, విది,విధానాలు, ప్రభుత్వ అధికారుల పనితీరును ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు... ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి సూచించారు... ముఖ్యంగా ఈ చట్టం ద్వారా సమాజంలోని మహిళల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి మహిళల సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అని అన్నారు... ఈ సభను ఉద్దేశించి ఐలపోగు. భాస్కరరావు రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక అధ్యక్షులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగి ఉండి ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా సమాజానికి ఉపయోగపడే ఒక కార్యకర్తల... ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారిదిగా ఉంటూ...ఈ చట్టం అమలు జరిగేలా చూడాలని అన్నారు... ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, ఉపాధ్యక్షుడు షేక్. ఆరిఫ్, రెవిన్యూ డివిజన్ ఉపాధ్యక్షులు కామా. బాబురావు, కే. శాంత కుమార్, కే వీరవసంతరావు, ఆర్. రమేష్, టి. మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు...
జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఎన్టీఆర్ జిల్లా స్థాయి సమావేశం...
జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఎన్టీఆర్ జిల్లా స్థాయి సమావేశం...
Admin
N7TV News Telugu